clean2politics

for save politics to uncivilized politicians

Thursday, May 5, 2016

augusta westland chapper scam

pls give me big hands to save politics
అగస్టా వెస్టల్యండ్ 2012 చివర్లో దేశాన్ని ఓ కుదుపు కుదిపిన కుంభకోణం, తిరిగి తాజాగా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చడానికి ఎన్డీయే బయటకు తీసిన అస్రం, గత కొద్దిరోజులుగా పార్లమెంట్ ఉభయసబల్లో ముఖ్యంగా పెద్దల సబలో సంఖ్యాబలంతో అధికార పార్టీని ముప్పతిప్పలు పెడుతున్న ప్రతిఫక్షాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం వదిలిన పాశుపతాస్రం

దీనిమీద 2013లోనే సీబీఐ దర్యాప్తు మెదలు పెట్టింది, అప్పట్లో ఈ కుంభకోణం చాపర్ స్కామ్, చాపర్ గేట్గా వెలుగులోకొచ్చింది, కానీ యూపీయే2 హయాంలో కేవలం దస్రాలకే పరిమితమైంది ఈ కుంభకోణం,

అగస్టా పూర్తి కథ బహు చిత్రంగా ఉంటుంది ఎక్కడో ఇటలీలో మెదలై భారత అగ్ర రాజకీయాన్ని తీవ్ర ప్రబావితం చేసిన కుంభకోణం, దాదాపు 3600కోట్ల అంచనాతో 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంభందించిన ఒప్పందం ఇది, ప్రదానమంత్రి ఇతర ముఖ్యుల పర్యటనల భద్రత కోసం తక్కువ ఎత్తులో తిరిగే హెలికాప్టర్లని కొనుగోలు చేయాలని యూపీయే2 అదికారంలోకొచ్చిన కొత్తలో ఒ నిర్ణయం తీసుకున్నారు, అందులో భాగంగా ఇటలీకి చెందిన రక్షణ పరికరాల సంస్థ ఫిన్ మెకానికాతో హెలికాప్టర్ల కొనుగోలుకు 2010 పిబ్రవరిలో యూపీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది, ఈ హెలికాప్టర్ల తయారీ భాద్యతని పిన్ మెకానికా అనుభంద సంస్థ ఐన అగస్టావెస్ట్ల్యాండ్ తీసుకుంది, ఐతే ఈ ఒప్పందం కోసం భారత్ లోని వివిద వర్గాలకి దాదాపు 230 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారనేది ప్రధాన అబియేగం, ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇటలీ ప్రబుత్వం దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెల్లడయ్యాయి, పిబ్రవరి 2013లో పిన్ మెకానికా సీఈవో గిస్పెపీ ఓర్సీని ఇటలీ ప్రభుత్వం అరెస్ట్ చేయడం ద్వారా మెత్తం కుంభకోణం వెలుగులోకి వచ్చింది,
అదేసమయంలో సుభ్రమణ్యస్వామి తన సొంత బ్లాగ్లో ఈకుంభకోణంకి సంబందించిన కొన్ని పత్రాలని బహిర్గత పరిచి తీవ్ర చర్చకు తెరతీసాడు, నింద తనమీదకి రాకుండా ఉండడం కోసం అప్పటి యూపీయే ప్రబుత్వం 30 మందితో పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా, సీబీఐ దర్యాప్తుకు కూడా ఆదేశించింది,
దర్యాప్తు సంస్థ విచారణలో ఆర్మీ డీలర్ ఐన అభిషేక్ వర్మది రోమన్ సంతతికి చెందిన అతని భార్య అనే నేక్సూ ది  చురుకైన పాత్రని తేల్చింది, రాజకీయంగా కీలక నేతలతో సంభందాలున్న అభిషేక్ వర్మ మద్య వర్తిత్వం నెరపడమే కాకుండా కాబినేట్ కమిటీనుండి సులువుగా క్లియరెన్స్ సర్టిపికెట్స్ సంపాదించిపెట్టాడు, ఈ మెత్తం వ్యవహారంలో ముడుపులు అందిన తీరుని గమనిస్తే కిక్ బాక్స్ సిస్టమ్ ద్వారా ముడుపుల సొమ్ముని తిరిగి భారత్కి చేరవేశాడు అందులో ముఖ్యంగా గొలుసు కంపెనీల ఏర్పాటు చేసి అగస్టావెస్ట్యాండ్నుండి మారిషన్ కేంద్రంగా నడుస్తున్న అట్లాస్ డిపెన్స్ సిస్టమ్ కంపెనీలొకి నిదుల రూపంలో మల్లించాడు అక్కడి నుండి బెర్ముడా అకౌంట్స్తో పాటు తన బార్య కంపెనీ ఐనా న్యూయార్క్ కంపెనీ లి. లోకి మల్లించాడు, అక్కడినుండి ఇండియాలోని అప్పటి కేంద్రమంత్రి సంతోష్ బర్కాడియా సొదరుడైన సతీస్ బర్కోడియా సారథ్యంలోని ఐడీస్ ఇన్పోటెక్లొకి డబ్బుల్ని ట్రాన్సఫర్ చేశారు, అక్కడి నుండి ప్రబుత్వ పెద్దలకి, అదికారులకి ఈ డబ్బు చేరిపోయింది. చండిఘడ్ కేంద్రగా ఉన్న ఈ సంస్థకి డిపెన్స్ వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికి ఈ ఒప్పదంలో కీలక భూమిక పోషించింది, 2005లోనే ఈ కంపెనీ డైరెక్టర్గా అప్పటి కేంద్రమంత్రి సంతోష్ బర్గాడియా కుమారుడు ప్రతాప్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు, దీన్ని బట్టి అగస్టా వెస్ట్ల్యాండ్కి యూపీయే1 హయాంలోనే బీజం పడింది అనుకోవచ్చు. ఇక సతీస్ బర్గాడియా అప్పటికే 600 కోట్ల కోల్ బ్లాక్ స్కామ్లో నిందితుడు,

సీబీఐ విచారణలో బాగంగా మాజీ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్పీ త్యాగీతో పాటు మరో 13 మందిపై అలాగే ఇటలీకి చెందిన అగస్టావెస్ట్ల్యాండ్, చండీఘడ్కి చెందిన ఐడీస్ ిఇన్పోటెక్, మరియు ఆక్రోమాట్రిక్స్ మీద అభియేగాలు నమేదు చేసింది, అభిషేక్తో పాటు అతని బార్య అనా నెక్సూని అరెస్ట్ చేసి తిహార్ జైలుకి పంపించడం జరిగింది,

ఈ కేసులో వెలుగులోకి వచ్చినప్పుడే యూపీయే2 సుమారు 2068కోట్లను తిరిగి రాబట్టామనే విషయాన్ని గొప్పగా ప్రచారం చేశారు కానీ 3600 కోట్లలో మిగిలిన 42.55 శాతం 1532 కోట్లు ఏమయ్యాయి, అంటే ముడుపుల సొమ్ము 260 కోట్లా లేక రాబట్టుకోలేక పోయిన మెత్తం సొత్తా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న

దాదపు మూడు సంవత్సరాలుగా స్థబ్థుగా ఉన్న ఈకేసు సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ఏంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే పార్లమెంట్లో కదిపి మరోసారి తేనెతుట్టెను కదిలించాడు, ఇటలీ ప్రభుత్వ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి, ఇందులో ముడుపులు అందించడానికి ఎన్నుకొన్న కోడ్ లాంగ్వేజ్ యాంటీ టెర్రరిస్ట్ అక్టివిటీలో తలపండిన మేదావులు కూడా చాలాకాలం చేదించలేక పోయారు, గియూలీ, ఏపీ,సిన్యోరా గాంది, బీయూఆర్, ఏఎఫ్, వంటి కోడ్ నేమ్లు ఈ కేసులో ప్రదానంగా వినిపించాయి, సిన్యోరా అంటే సోనియా గాంది అని ఏ ఆర్ అంటే సోనియా రాజకీయ సలహాదారు ఆహ్మద్ పటేల్అని, ఇంకా మన్మోహన్ సింగ్, ఆస్కార్ పెర్నాండేజ్, వీరప్ప మెయిలీ, చివరికి ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ పేరు కూడా వినిపించింది, ముఖ్యంగా ఇటలీ దర్యాప్తు సంస్థలు అగస్టా వ్యవహరంలో కంపెనీ తరుపున మద్యవర్తిత్వం నడిపిన మైఖేల్ ఆ కంపెనీ ఇండియన్ హెడ్ పీటర్ హ్యూలైట్కి రాసిన లేఖలో డైవింగ్ పోర్స్ సోనియా అని పేర్కోనడంతో పాటు ఈ ప్రముఖుల పేర్లని భహిర్గతపరిచింది, ఇంత జరిగినా మన దర్యాప్తు సంస్థ ఆ లేఖని సంపాదించకపోవడం వెనుక మతలబు అర్థంకానిది ఏంకాదు, ఏ ప్రబుత్వం అదికారంలో ఉంటే వారికి వంతపాడడమే దీనికి కారణమనే విమర్షలు కూడా ఉన్నాయి. లంచం ఇచ్చిన అనేక మంది ఇటలీ అదికారులను ఆ దేశం నేరాన్ని నిరూపించి జైల్లో పెట్టగల్గింది, కానీ ఆ ఇటలీకి మల్లే మన ప్రబుత్వాలు ఖచ్చితమైన న్యాయ పనితనాన్ని చూపలేకపోవడం, మన దర్యాప్తు సంస్త పార్లమెంట్కి కాకుండా ప్రభుత్వాలకి భాద్యత వహించడం కారణ మనేది కాదనలేని సత్యం, ప్రస్తుతం పాలకులైన ఎన్డీయే నేతలైనా ఈ భండారాన్ని బయటపెడుతారా లేక కేవలం రాజ్యసభలో కాంగ్రెస్ సమ్మతిస్తే క్విడ్ ప్రో కో మాదిరిగా మీకది మాకిది అని వదిలేస్తారా వేచి చూడాలి.


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home